హన్మకొండ: ఇండస్ ఫౌండేషన్ వారి అధ్వర్యంలో మెగా జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్,
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ, సిడిసి కాలేజీ నందు ఈ నెల 20వ తేదీన ఉదయం 9గంటలకు జాబ్ మేళా ఉంటుందని తెలిపారు. 50కి పైగా కంపెనీ లు పాల్గొననున్న ఈ మేళా లో నిరుద్యోగ యువత అధిక సంఖ్యలో పాల్గొని, సద్వినియోగం చేసుకోవాలని సోమవారం ఆయన సూచించారు.