ఉగాది పండుగ పూట వరంగల్ బస్ స్టాండ్ కూల్చివేసే క్రమంలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం బస్టాండ్ వద్ద ఉన్న నీళ్ల ట్యాంకును కూల్చివేస్తుండగా శిధిలాల కింద పడి బొంత రవి అనే కూలి మృతి చెందాడు. స్థానిక ఇంతేజార్గంజ్ పోలీసులు ఎంజీఎం మార్చురీకి తరలించారు. 5 సంవత్సరాలుగా 16వ డివిజన్ గరీబ్ నగర్ లో మృతుడు నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు, స్వగ్రామం మనబోతుల గడ్డ, ఖానాపురం మండల వాసిగా గుర్తించారు.