అత్యాచారం ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలి

64చూసినవారు
అత్యాచారం ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలి
జూనియర్ వైద్యురాలి సామూహిక అత్యాచారం ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని ఐద్వా రాష్ట్ర సహాయ కార్య దర్శి రత్నమాల డిమాండ్ చేశారు. ఆదివారం ఖిలావరంగల్ పడమరకోట అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కొవ్వొత్తులు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు ఠాగూర్ భవాని, అనిత, నహీద్, మానస, రమ, ప్రభావతి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్