రంజాన్ మాసంలో కఠిన నియమాలతో చేపట్టిన ఉపవాస దీక్షలు ముగిశాయి. బుధవారం సాయంత్రం నెలవంక దర్శనమివ్వడంతో గురువారం రంజాన్ పండుగను జరుపుకునేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు. ప్రార్థనలు చేసేందుకు వరంగల్ నగరంలో ఈద్గాలు, మజీదులను ముస్తాబు చేశారు. విద్యుత్ దీపాలతో అలంకరించారు.