రంగశాయిపేటలో ఉగాది కవి సమ్మేళనం

62చూసినవారు
వరంగల్ రంగశాయిపేటలో మనోళ్లాస సాహితీ కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 40 మంది కవులు ఈ కవి సమ్మేళనానికి హాజరయ్యారు. వచ్చిన ప్రతి ఒక్క కవి అద్భుతమైనటువంటి తమ కవితలను వినిపించి ఆలోచింపజేశారు. ఈ కార్యక్రమంలో దోమల బిక్షపతి, దోమల నగేష్, రమేష్, దామోదర్, లక్ష్మీనారాయణ, కుమారస్వామి, నాగరాజు, జనార్ధన్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్