రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటన సందర్భంగా మంగళవారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గూడెప్పాడు వద్ద ఉన్న ఎన్ఎస్అర్ హోటల్ కు సీఎం కాన్వాయ్ చేరుకుంది. మేడిగడ్డ పర్యటనలో భాగంగా హనుమకొండ జిల్లాకు చేరుకున్న ముఖ్యమంత్రి నేరుగా ఎన్ఎస్అర్ హోటల్ కు చేరుకొని భోజన విరామం తీసుకున్నారు. అక్కడి నుండి నేరుగా మేడిగడ్డకు మరికొద్ది సేపట్లో బయలుదేరనున్నారు.