హనుమకొండ ఓటరు చైతన్యంపై ఈనెల 16వ తేదీన నిర్వహించే 5కె రన్ ను విద్యార్థులు, యువత, అధికారులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో 5కె రన్ కు సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అడిషనల్ కలెక్టర్లు రాధిక గుప్తా, వెంకట్ రెడ్డి ఆవిష్కరించారు.