బీసీసీఐ నిర్వహించే వార్షిక అవార్డుల ఫంక్షన్కు హైదరాబాద్ వేదిక కానుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం దేశంలోని అత్యుత్తమ క్రికెటర్ల విజయాలను గుర్తించి వారిని గౌరవించే వేదిక. కరోనా కారణంగా మూడేళ్ల కిందట నిలిచిపోయిన ఈ ఫంక్షన్ను ఈ ఏడాది బీసీసీఐ నిర్వహించనుంది. ముంబై వేదికగా 2020 జనవరిలో చివరిసారిగా బీసీసీఐ అవార్డుల ఫంక్షన్ నిర్వహించింది. ఇక ఈ ఏడాది జనవరి 23న హైదరాబాద్లో భారీ ఈవెంట్ను నిర్వహించేలా ఏర్పాట్లు మొదలుపెట్టారు.