మాఫియాపై ఉక్కు పాదం మోపుతాం: సీఎం

62చూసినవారు
మాఫియాపై ఉక్కు పాదం మోపుతాం: సీఎం
వచ్చే నెల 4 తర్వాత యూపీని ‘మాఫియా రహిత ‘ రాష్ట్రంగా ప్రకటిస్తామని ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. క్రిమినల్ సిండికేట్‌లపై తమ ప్రభుత్వం కఠిన వైఖరిని అనుసరిస్తోందని తెలిపారు. మాఫియాకు చెందిన ఆస్తులను జప్తు చేయడమే కాకుండా, ఆయా ఆస్తులను సమాజంలోని నిరుపేద, అనాథ, మహిళా ఆశ్రమాలు, వికలాంగుల అవసరాలను తీర్చేందుకు, వెనుకబడిన వర్గాలకు పునఃపంపిణీ చేసేందుకు వినియోగిస్తామని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్