మహాశివరాత్రి జరుపుకోవాలంటే అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో మాఘ బహుళ చతుర్దశి తిథి ఉండి తీరాలి. ఈ ప్రకారం చూస్తే బుధవారం ఉదయం 9:47 నిమిషాల నుంచి మరుసటి రోజు గురువారం ఉదయం 8:41 నిమిషాల వరకు చతుర్దశి తిథి ఉంది. అర్ధరాత్రి చతుర్దశి తిథి ఉండాలన్న నియమం ప్రకారం ఫిబ్రవరి 26వ తేదీనే మహా శివరాత్రిగా జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు.