ఓట్లు డబ్బాలో పడగానే.. కాంగ్రెస్ కు రైతుల అవసరం తీరింది: KCR

51చూసినవారు
ఓట్లు డబ్బాలో పడగానే.. కాంగ్రెస్ కు రైతుల అవసరం తీరింది: KCR
ఓట్లు డబ్బాలో పడంగనే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరిందని.. అందుకే నాలిక మల్లేసి ఎప్పటి మాదిరిగానే నయవంచనకు పూనుకున్నారని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. 'ఇదే సన్న వడ్లకు మాత్రమే అనే మాట ఎన్నికలకు ముందు గనుక చెప్పింటే కాంగ్రెస్ ను రైతులు తుక్కు తుక్కు చేసేవాళ్లు. ఇప్పటికీ ప్రజలు ఆగ్రహంతోనే ఉన్నారు. రైతు బంధు ఇయ్యక, రైతు భరోసా ఇయ్యకుండా రైతాంగాన్ని అన్నిరకాలుగా కాంగ్రెస్ మోసం చేస్తున్నది. అందు కారణంగానే BRS రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టింది' అని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్