మోదీ కేబినెట్లో యూపీకి అత్యధికంగా 10 మంత్రి పదవులు దక్కాయి. ఆ తర్వాత బీహార్-8, మహారాష్ట్ర-6, మధ్యప్రదేశ్-5, రాజస్థాన్-5, గుజరాత్-4, కర్ణాటక-4, ఏపీ-3, తమిళనాడు-3, హర్యానా-3 మంత్రి పదవులు దక్కాయి. అలాగే తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, ఒడిశా, జుర్ఖండ్ రాష్ట్రాలకు రెండు మంత్రి పదవులు లభించాయి. ఢిల్లీ, గోవా, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఒక్కో మంత్రి పదవి దక్కింది.