2024, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన సవరించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వేతనాల ప్రకారం దేశంలో హరియాణా రాష్ట్రంలో నైపుణ్యం లేని కార్మికులకు రోజువారీ వేతనం అత్యధికంగా రూ.374 చెల్లిస్తున్నారు. అరుణాచల్ప్రదేశ్, నాగాలాండ్లలో అత్యల్పంగా రూ.234గా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఏపీ, తెలంగాణాల్లో ఉపాధి హామీ రోజువారీ వేతనం రూ.300గా ఉంది.