అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రంగా అభివృద్ధి చేస్తా: మంత్రి

76చూసినవారు
అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రంగా అభివృద్ధి చేస్తా: మంత్రి
సాగర్ బుద్ధ వనాన్ని అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ వద్ద నున్న బుద్ధవనాన్ని ఇవాళ పరిశీలించి, సాగర్ టూరిజం అభివృద్ధిపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. బుద్ధ వనాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక డెస్టినేషన్ సెంటర్‌గా తీర్చిదిద్దుతామన్నారు. సాగర్ బుద్ధవనాన్ని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించాలన్నారు.

సంబంధిత పోస్ట్