ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 (WPL)కు సంబంధించిన షెడ్యూల్ గురువారం విడుదలైంది. ఫిబ్రవరి 14న ఈ టోర్నీ ప్రారంభం కానుంది. మార్చి 15న ముంబైలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఓపెనింగ్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ బెంగళూరుతో గుజరాత్ ఢీకొననుంది. ఈ టోర్నీలో భాగంగా ముంబై, బెంగళూరు, వడోదర, లఖ్నవూ స్టేడియాల్లో మొత్తం 22 మ్యాచ్లు జరగనున్నాయి. అత్యధికంగా బెంగళూరు 8 మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుంది. అన్ని మ్యాచ్లు రాత్రి 7.30 గంటలకు ప్రారంభం అవుతాయి.