పరీక్షలకు సంబంధించి వసతిగృహాల విద్యార్ధులకు అన్ని వసతులు కల్పించాలని జిల్లా కలెక్టరు హనుమంతు సంక్షేమ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ లో సంక్షేమ గురుకుల వసతి గృహాల అధికారులతో ఆయన సమావేశమై పరీక్షలకు సంబంధించి విద్యార్ధులకు అన్ని వసతులు కల్పించాలన్నారు. మంచి భోజన వసతి ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గంగాధర్ ఆర్ డి ఓ అమరేందర్ పాల్గొన్నారు.