వేసవిలో ఆయిల్ పామ్ తోటల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఉద్యానవన అధికారి జి. అన్నపూర్ణ శుక్రవారం ఒక ప్రకటనలో రైతులను కోరారు. జిల్లాలో సుమారు 750 మంది రైతులు 3600 ఎకరాలలో ఆయిల్ పామ్ తోటలు సాగు చేస్తున్నారన్నారు. ఈ తోటల పట్ల రైతులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే చెట్లు వృద్ది చెందుతాయన్నారు.