ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. కృత్తికా అనే యువతి మెడికల్ కాలేజీలో MBBS ఫస్ట్ ఇయర్ చదువుతూ హాస్టల్లో ఉంటుంది. గురువారం కృతికా తన ఫ్రెండ్ కునాల్ తో కలిసి రాత్రి వేళలో వాకింగ్ కి వెళ్ళింది. అయితే హాస్టల్ మూసే సమయానికి వారు తిరిగి రాకపోవడంతో.. హాస్టల్ వాసులు వారిద్దరి కోసం వెతకండంతో ఓ రైల్వే ట్రాక్ పై కృతికా మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి హత్య కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.