చందుపట్ల: 'కాంగ్రెస్లో చేరికలను ఖండించిన గ్రామ శాఖ’

82చూసినవారు
భువనగిరి మండలం చందుపట్ల గ్రామం నుంచి నిన్న కొందరు గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ గ్రామశాఖ కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసిన వారిని పార్టీలో చేర్చుకోవడం సబబు కాదన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను కూడా వారు తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని గుర్తుచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్