భువనగిరి పట్టణంలో సిపిఎం పార్టీ నాయకులు శనివారం ఇంటింటికి ప్రచారం చేపట్టారు. జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి సిపిఎం ఎంపీ అభ్యర్థి ఎండి జహంగీరును సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాయ కృష్ణ సలీం వనం రాజు తదితరులు పాల్గొన్నారు.