ఆర్టీసీ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తం శనివారం యాదగిరిగుట్ట డిపోను సందర్శించారు. ప్రభుత్వం నూతనంగా చేపట్టిన మహాలక్ష్మి పథక అమలు తీరును గమనించారు. డిపోలో అన్ని విభాగాలను తనిఖీ చేసి ఉద్యోగులకు కావలసిన సదుపాయాలను తెలుసుకున్నారు. కొండపైకి వెల్లే భక్తులకు దేవస్థానం వారి సహాయంతో నడుపుతున్న ఉచిత బస్సు బస్సులపై ఆలయ ఈవో తో కలిసి సమావేశం నిర్వహించారు. డిపో మేనేజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.