పచ్చదనం, పర్యావరణ రక్షణ కోసం సమాజంలో ప్రతి ఒక్క విద్యార్థి బాధ్యతగా మొక్కలను నాటి వాటిని కాపాడుకోవడం చాలా అవసరమని ఉరవకొండ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మమత అన్నారు. ప్రస్తుతం వర్షాలు బాగా కురుస్తున్న సమయంలో ప్రతి విద్యార్ధి ఎక్కడో ఒక చోట ఒక మొక్క నాటి దానిని సంరక్షించే భాద్యత తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం మొక్కలు నాటారు.