అసెంబ్లీ స్పీకర్గా టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. నర్సీపట్నం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అయ్యన్న, ఐదుసార్లు మంత్రిగా పని చేశారు. అయితే ఈ సారి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో స్పీకర్ పదవి ఇస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమేనంటూ ఆయనే ధ్రువీకరించారని అయ్యన్న సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.