AP: ఎన్నికల్లో ఘోరంగా ఓడిన వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అక్రమం, అనుమతులు లేవంటూ రాష్ట్రంలోని వైసీపీ కార్యాలయాలకు అధికారులు వరుసగా నోటీసులు ఇస్తున్నారు. ఆదివారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని CRDA అధికారులు కూల్చివేశారు. తర్వాత విశాఖలోని పార్టీ ఆఫీస్కు నోటీసులు అందగా.. తాజాగా కడప జిల్లా పార్టీ ఆఫీస్ నిర్మాణం అక్రమం అంటూ నగరపాలక సంస్థ అధికారులు నోటీసులు జారీ చేశారు.