AP: ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారిలో ఇద్దరు నేతలకు చంద్రబాబు కేబినేట్లో చోటు దక్కింది. కొలుసు పార్థసారథి (నూజివీడు), ఆనం రామనారాయణరెడ్డి (ఆత్మకూరు) మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక గుమ్మనూరి జయరాం(గుంతకల్లు), వసంత వెంకటకృష్ణప్రసాద్ (మైలవరం), కోనేటి ఆదిమూలం (సత్యవేడు), కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (నెల్లూరు రూరల్)లకు మంత్రివర్గంలో చేరేందుకు అవకాశం దక్కలేదు.