టీడీపీ అధినేత చంద్రబాబు తన అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి రానున్నారు. బుధవారం ఉదయం 8.30 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్లోని తన నివాసానికి వెళ్లనున్నారు. ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన విదేశీ పర్యటనకు వెళ్లారు.