చిత్తూరు గిరింపేట సావిత్రమ్మ ప్రభుత్వ బాలికల డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ మనోహర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఉన్న కోర్సులతో పాటు బీబీఏ కోర్స్ ను నూతనంగా ప్రవేశపెడుతున్నామన్నారు. బీసీ, ఎస్సీ విద్యార్థులకు హాస్టల్ వసతి కలదన్నారు. వర్చువల్ విధానంలో అభ్యసన ఉంటుందన్నారు. ఆసక్తిగలవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.