క్యాన్సర్ పై వైద్య సిబ్బందికి అవగాహన కార్యక్రమం

53చూసినవారు
క్యాన్సర్ పై వైద్య సిబ్బందికి అవగాహన కార్యక్రమం
చిత్తూరు జిల్లా పుంగనూరు ఏరియా ఆసుపత్రిలో సూపరింటెండెంట్ మధుసూదన్ మంగళవారం క్యాన్సర్ వ్యాధిపై వైద్య సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారి మాట్లాడుతూ క్యాన్సర్ పట్ల వైద్యులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని కోరారు. క్యాన్సర్ను సకాలంలో గుర్తిస్తే ప్రాణాలను కాపాడగలుగుతామని తెలిపారు. ప్రజలకు క్యాన్సర్ పై అవగాహన కల్పించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్