AP: రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య జరుగుతోన్న ఘర్షణలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. వైసీపీ కవ్వింపు చర్యలపై టీడీపీ క్యాడర్ సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. దాడులు, ప్రతి దాడులు జరగకుండా చూడాలని టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలను ఆదేశించారు. శాంతిభద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు.