చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటనలో ఆసక్తికర ఘటన జరిగింది. ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్లో ప్రజల నుంచి సీఎం వినతులు స్వీకరిస్తుండగా.. శాంతిపురం మండలానికి చెందిన సుధాకర్, ప్రియ దంపతులు తమ రెండో కుమార్తెకు నామకరణం చేయాలని చంద్రబాబును కోరారు. ముద్దులొలికే చిన్నారిని చేతుల్లోకి తీసుకున్న బాబు 'చరణి' అని పేరు పెట్టారు. తమ బిడ్డకు సాక్ష్యాత్తూ సీఎం పేరు పెట్టడంతో తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.