పార్టీ కార్యకర్తలకు సీఎం జగన్‌ సందేశం

AP: ఎన్నిక‌ల కౌంటింగ్ నేప‌థ్యంలో వైసీపీ కార్యకర్తలకు సీఎం జ‌గ‌న్ తన సందేశాన్ని పంపారు. "ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ.. ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను." అని పేర్కొంటూ సోమ‌వారం రాత్రి ఆయ‌న ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్