ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు డబ్బు ఖర్చు పెట్టాల్సిందే అంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. "కనీసం భోజనాలైనా పెట్టకపోతే ఎలా? ఓట్లు కొంటారా లేదా అనే నిర్ణయం మీరు తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ కూడా ఖర్చును రూ.45 లక్షలకు పెంచింది. అసలు ఓట్లు కొనలేని పరిస్థితి ఉంటే సంతోషం. దేశమంతా అందమైన అబద్ధంలో బతుకుతోంది. వేల కోట్లు ఖర్చు పెడతారు కానీ దాని గురించి ఎవరూ మాట్లాడరు." అని పవన్ వ్యాఖ్యానించారు.