AP: ఓటమి నైరాశ్యంలో ఎన్నికల కౌంటింగ్ రోజు వైసీపీ హింసకు పాల్పడే ప్రమాదం ఉందని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు అనుమానం వ్యక్తం చేశారు. "కుట్రలో భాగంగా పోలీస్ ఠాణాల్లో సీసీ కెమెరాలు పనిచేయకుండా చేస్తున్నారు. వైసీపీ రౌడీరాజ్యంపై సాక్షాల్లేకుండా చేయాలనే కెమెరాలపై కుట్రలు పన్నుతున్నారు. ఈసీ తక్షణం జోక్యం చేసుకుని సీసీ కెమెరా వ్యవస్థ మొత్తం పనిచేసేలా చూడాలి." అని ప్రత్తిపాటి డిమాండ్ చేశారు.