AP: ఎన్నికల్లో ఓటమిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. "ఓటమి కేవలం ఇంటర్వెల్ మాత్రమే. శకుని పాచికల మాదిరిగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి.. కానీ ఆధారాలు లేకుండా మాట్లాడలేం. శ్రీకృష్ణుడు తోడుగా ఉన్నా పాండవులు అప్పుడప్పుడూ ఓడిపోయారు. చివరికి ప్రతి ఒక్కరు అర్జునుడిలా విజయం సాధిస్తారు." అని జగన్ పేర్కొన్నారు. తాడేపల్లిలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు.