రాజకీయాల్లో ఉండటానికి అర్హత లేని వ్యక్తి జగన్ అని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. 'జగన్ చేసిన ఘోరాలు రాష్ట్రాన్ని వెంటాడుతున్నాయి. ఇది ఎన్నేళ్లు అనేది కాలమే నిర్ణయించాలి. జగన్కు 986 మంది పోలీసులతో భద్రత ఉండేది. అసలు సీఎంకు అంత భద్రతా అవసరమా? ఇప్పుడు కూడా నేను వెళ్తుంటే అధికారులు పరదాలు కట్టేస్తున్నారు. ఇవన్నీ వద్దని చెప్పా. ఆలస్యమైనా ఫర్వాలేదు.. ట్రాఫిక్ ఆపొద్దని స్పష్టం చేశా'అని పేర్కొన్నారు.