AP: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంపై రాష్ట్ర రవాణా శాఖ రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే నెల రోజుల్లోనే ఈ పథకం అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ పథకం కోసం వచ్చే 15 రోజుల్లో కమిటీ వేస్తామని తెలిపారు. అలాగే పథకం అమలు తీరుపై రెండు పక్క రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేస్తామని వివరించారు.