CM జగన్ పోటీలో ఉన్న పులివెందుల, TDP అధినేత చంద్రబాబు బరిలో ఉన్న కుప్పంలోనూ పందేలు కట్టినట్టు తెలిసింది. వీరి గెలుపు ఖాయం కావడంతో మెజారిటీపైనే ఎక్కువగా పందెంరాయుళ్లు దృష్టి పెట్టారు. గత ఎన్నికల్లో వచ్చినంత మెజారిటీ ఈ ఎన్నికల్లో జగన్కు రాదని ఎక్కువ మంది పందెం కట్టినట్టు తెలిసింది. చంద్రబాబు మెజారిటీ విషయంలోనూ ఇదే తరహా పందేలు కట్టినట్టు సమాచారం.