వాడపల్లి వెంకన్నను దర్శించుకున్న జెసి నిశాంతి

కోనసీమ తిరుమల గా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి శనివారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు జేసీ నిశాంతికి ఆలయ సాంప్రదాయ పద్దతిలో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అసిస్టెంట్ కమిషనర్ ఎన్ఎస్ చక్రధర్ రావు జెసి నిశాంతికి స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు.

సంబంధిత పోస్ట్