AP: ఆరోగ్యశ్రీ సీఈవోతో నెట్ వర్క్ హాస్పిటళ్ల అసోషియేషన్ సభ్యులు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. జూమ్ ద్వారా జరిగిన సమావేశంలో రూ. 800 కోట్ల బకాయిలు విడుదల చేయాలని నెట్ వర్క్ ఆస్పత్రుల సభ్యులు కోరారు. అయితే ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో బంద్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.