మన్యం జిల్లా కొమరాడ మండలం వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. గుజ్జాబడి సమీపంలో ఆటో బోల్తా కొట్టింది. వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఒడిశాకు చెందిన 14 మందికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.