గుమ్మలక్ష్మీపురం మండలం సప్పగూడ గ్రామ సమీపంలో గల ఘాట్ రోడ్డు వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లప్పటి గ్రామానికి చెందిన 14 మంది ఆటోలో ఘోరటి గ్రామంలో పెళ్లి కి వెళ్లి తిరిగి వస్తుండగా అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 5 గురికి తీవ్రగాయాలు అయ్యాయి. హుటాహుటిన క్షతగాత్రులను తాడికొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.