AP: మంత్రి అంబటి రాంబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సత్తెనపల్లిలో 4 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలంటూ కోర్టులో అంబటి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణ జరిపిన కోర్టు అంబటి పిటిషన్ను డిస్మిస్ చేసింది. అలాగే చంద్రగిరిలోనూ రీపోలింగ్ జరపాలన్న వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పిటిషన్ను కూడా కోర్టు డిస్మిస్ చేసింది.