AP: విశాఖలో రౌడీయిజం బాగా పెరిగిందని బీజేపీ విశాఖ నార్త్ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. తాము ప్రచారం చేస్తున్న సమయంలోనూ కొందరు అడ్డుకున్నారన్నారు. "కూటమికి ఓటేశారని విశాఖలో ఓ కుటుంబంపై దాడి చేయడం దారుణం. కుటుంబ తగాదాల వల్లే ఈ దాడులు అనేది అబద్ధం. బాధితులకు రక్షణ కల్పించాలి. ఈ ఘటనపై సీపీ, కలెక్టర్కు ఫిర్యాదు చేస్తాం. వైసీపీ గూండాలకు పోలీసులు మద్దతిస్తున్నారు." అని ఆయన ఆరోపించారు.