ఎన్నికల హింసపై ప్రాథమిక విచారణ పూర్తి

AP: పోలింగ్ రోజు, ఆ తర్వాత రోజుల్లో చెల‌రేగిన హింస‌పై ప్రాథమిక విచారణ పూర్తి చేసి ఈసీకి సీఈవో కార్యాలయం నివేదిక అంద‌జేసింది. రేపటిలోగా పూర్తిస్థాయి నివేదిక ఈసీకి అంద‌నుంది. ఈ క్ర‌మంలో ఈసీ ఆదేశాల మేరకు సీఎస్ జవహర్ రెడ్డి సిట్ ఏర్పాటు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఏడీజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్‌ను నియమించినట్లు సమాచారం. పూర్తిస్థాయి నివేదిక ఈసీకి చేరాక‌.. కీలక నేతలను అరెస్టు చేస్తారని వార్తలు వస్తున్నాయి.

సంబంధిత పోస్ట్