AP: రాష్ట్రంలో టెట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్కు టీడీపీ ఎమ్మెల్సీలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం అందించారు. ఎమ్మెల్సీల వినతికి మంత్రి లోకేశ్ సానుకూలంగా స్పందించారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో శ్రీకాంత్, చిరంజీవి, రామ్గోపాల్రెడ్డి ఉన్నారు.