విజయవాడ పటమట రెల్లి కాలనీలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే గద్దె సోమవారం పర్యటించారు. తాగునీటి నాణ్యత, ఇతర సమస్యలను మంత్రి నారాయణ తెలుసుకున్నారు. విజయవాడ వ్యాప్తంగా 12 లక్షల మందికి 187 ఎం.ఎల్.డీ నీటి సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు ఆరు వందల శాంపిల్స్ పరిశీలించామని, మంచి నీటిలో నాణ్యత నిబంధనల ప్రకారమే ఉన్నట్లు గుర్తించామన్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో డయేరియా వచ్చే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.