టీడీపీ అధినేత చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే ‘మహాశక్తి’ కింద ఐదు కార్యక్రమాలు తీసుకొస్తామని చెప్పారు. ‘తల్లికి వందనం’ పేరుతో మహిళలకు ఏడాదికి రూ.15 వేలు అందజేస్తామని తెలిపారు. విద్యార్థినుల ఉన్నత చదువుల కోసం బ్యాంకు రుణాలు తీసుకునేలా సహకరిస్తామని పేర్కొన్నారు. ఈ రుణాలకు ప్రభుత్వమే వడ్డీ కడుతుందని వివరించారు.