AP: వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి, ప్రకాశం జిల్లా దర్శి మాజీ ఎమ్మెల్యే శిద్ధా రాఘవరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను వైసీపీ అధినేత వైఎస్ జగన్కు పంపారు. వ్యక్తిగత కారణాల రీత్యా పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు లేఖలో వెల్లడించారు. 2014లో చంద్రబాబు హయాంలో మంత్రిగా శిద్ధా పనిచేశారు. 2019లో ఒంగోలు టీడీపీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ కండువా కప్పుకున్నారు.