విజయవాడలోని ఓ కన్వెన్షన్ హాల్లో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. ‘ప్రత్యేక హోదా కోసం జగన్ మూకుమ్మడి రాజీనామాలని చెప్పి డ్రామాలు చేశారు. 23 మంది వైసీపీ ఎంపీలు ఒక్కరోజు కూడా హోదా గురించి మాట్లాడలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్ల ప్రత్యేక హోదా తీసుకొస్తాం.’ అని షర్మిల అన్నారు.