AP: ఎన్నికల్లో వైసీపీ ఘోరం ఓటమి చెందడంపై ఆ పార్టీ మాజీ ఎంపీ మార్గాని భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. "మేం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చూసి మరోసారి జగనే సీఎం అవుతారని అనుకున్నాం. కానీ అనూహ్యంగా ఓటమిపాలయ్యాం. మా వ్యక్తిగత పనులను పక్కనపెట్టి మరీ ప్రజల కోసం ఐదేళ్లు కష్టపడ్డాం. అసలు మేమేం తప్పు చేశామో అర్థం కావడం లేదు. అభివృద్ధి చేసినా ప్రజల అభిమానాన్ని సంపాదించలేకపోయాం.' అని ఆయన పేర్కొన్నారు.